మన్యం మనుగడ న్యూస్, దమ్మపేట:దమ్మపేట మండలం అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపును ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ భద్రాచలం ఐటిడిఎ అధికారులు ఏర్పాటు చేసిన ఈ సమ్మర్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించి ఐటీడీఏ భద్రాచలంకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పైడి వెంకటేశ్వర రావు, ఎంపీపీ సోయం ప్రసాద్, ఏటిడిఓ చంద్రమోహన్, స్పోర్ట్స్ అధికారి వీరు నాయక్, ప్రధానోపాధ్యాయులు తోలెం వెంకటేశ్వర్లు వ్యాయామ ఉపాధ్యాయులు గోపాల్ రావు రామారావు నాగేంద్రమ్మ నాగమణి వెంకటరమణ, భవాని, రవి, శ్యామల అనూష తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: