CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏరియా సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


సింగరేణి చరిత్రలోనే ఉత్పత్తి వార్షిక లక్ష్యంలో పీకే ఓసి వంద లక్షల టన్నుల పై చిలుకు బొగ్గు ఉత్పత్తి మైలురాయిని అధిగ మించి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో,అదే స్థాయిలో పీకే ఓసి కార్మికులకు ప్రోత్సాహకంగా వెండి నాణెం బహుమతిగా ఇవ్వాలని ఏరియా సింగరేణి అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.సోమవారం సాయంత్రం జిఎం కార్యాలయం వద్ద సమావేశమైన ఏరియా సింగరేణి అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ,సింగరేణి చరిత్రలోనే లక్షల టన్నుల పైచిలుకు బొగ్గు ఉత్పత్తి సాధించి చరిత్ర సృష్టించిన ఈ నేపథ్యంలో పీకే ఓసి కార్మికులకు వెండి నాణాలు బహుమతిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే ఏరియా కార్మికులందరికీ స్వీట్ పంచాలని కోరారు.ఇప్పటికే వివిధ ఏరియాలలో ఉత్పత్తి లక్ష్యాలు సాధించిన సందర్భంగా కార్మికులను ప్రోత్సహిస్తూ ఆయా గనులలో వెండి నాణాలు అందజేశారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా ప్లేడే,పిహెచ్డి లపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు.కార్మికులందరికీ 2022 మార్చి 31 వరకు పిఎఫ్ జమ వివరాల చిట్టీలు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శివయ్య,ఐ ఎన్ టి యు సి నాయకులు వెలగపల్లి జాన్, సిఐటియు నాయకులు నందం ఈశ్వరరావు,బి ఎం ఎస్ నాయకులు వీరమనేని రవీందర్ రావు,హెచ్ ఎం ఎస్ నాయకులు బి.కుమార్, ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఎస్డీ.నాసర్ పాషా,ఏ.మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: