CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పీ వై ఎల్ నూతన కమిటీ ఎన్నిక

Share it:


గుండాల మే 11(మన్యం మనుగడ) ప్రజా పందా పార్టీ అనుబంధ సంఘమైన పి వై ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందని పి వై ఎల్ జిల్లా కార్యదర్శి వాంకుడోత్ అజయ్ అన్నారు. మే తొమ్మిదో తారీఖున ఇల్లందు ఎల్లన్న విజ్ఞాన కేంద్రం లోని పగడాల వెంకన్న హాల్లో 100 మంది ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అన్నారు. జిల్లా అధ్యక్షులు గా వాసం బుచ్చిరాజు, జిల్లా కార్యదర్శి గా వాంకుడోత్ అజయ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అన్నారు. వీరితో పాటు 17 మందిని జిల్లా కమిటీ లోకి తీసుకున్నామని వాంకుడోత్ పేర్కొన్నారు. పి వై ఎల్ నూతన కమిటీ జిల్లా లో ఎదుగుదల కోసం కృషి చేస్తోందని ఆయన అన్నారు

Share it:

TS

Post A Comment: