మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా కేంద్రంలో డిఎస్పీ అధికారి గెస్ట్ హౌస్ స్థలాన్ని భూకబ్జా చేసిన వారిపైన పిడీ యాక్ట్ కేసులను నమోదు చేయాలని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్
ఆదేశించారు.
జిల్లా కేంద్రంలో ప్రజల ఆస్తులు కబ్జా అవుతుంటే జిల్లా అధికార యంత్రాంగం
పట్టించుకోకుండా నిమ్మకునిరెత్తినట్టు వ్యవహరించడం దేనికి నిదర్శనం అన్నారు.
ఈ భూకబ్జాలో వెనుక ముందు అధికారులు,ప్రజాప్రతినిధులు ఎవ్వరు ఉన్న వదిలిపెట్టే ప్రసక్తేలేదని తెలిపారు.
ములుగు గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం పై నా దృష్టికి వచ్చింది.విజిలెన్స్ ఎంక్వేరి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ తెలిపారు.
డిపిఓ వెంకయ్య,మండల అధ్యక్షులు
బాదం ప్రవీణ్,పోరిక గోవింద్ నాయక్,పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్ కుమార్,యూత్ ప్రెసిడెంట్ సాగర్,గడ్డమీది భాస్కర్ మాదం సాగర్ వార్డు సభ్యులు నవీన్,ములుగు ఎంపీడీవో శ్రీనివాస్,ఈవో సి రంగి మహేందర్ గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
Post A Comment: