మన్యం మనుగడ దుమ్ముగూడెం::
కార్మిక,కర్షక సంక్షేమకోసం మేడే స్పూర్తితో తెలంగాణా ప్రభుత్వం పనిచేస్తోంది అని కార్మిక విభాగం అధ్యక్షులు గంట్ల సురేష్ అన్నారు.ఆదివారం మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణా కార్మిక విభాగం జెండా ను ఎగురవేసి ప్రపంచకార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ తక్కువ వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీలకు,ఆశావర్కర్ లకు,ఐ కె పి సిబ్బంది,విఆర్ఏ లు,ఈ జి ఎస్ సిబ్బంది,ఔట్ సోర్సింగ్ ఇతర సిబ్బందికి వేతనాలు భారీగా పెంచారని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయించి కార్మికుల రక్షణ,అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారని,కార్మికులంతా ఐక్యంగా మేడే స్పూర్తితో కార్మిక సంక్షేమకోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ మేడే వేడుకల్లో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి,ప్రధానకార్యదర్శి కణితి రాముడు, అధికారప్రతినిది యం డి జానీపాషా, కార్యదర్శులు కణితి లక్ష్మణ్, కెల్లా శేఖర్,ప్రచార కమిటీ అధ్యక్షుడు దామెర్ల శ్రీనివాస్,యువజన విభాగం అధ్యక్షుడు లంకా శివ,రైతు నాయకులు మద్ది రాము,నాయకులు పోడియం సుబ్బారావు, జిలకర గంగరాజు,ఉపసర్పంచ్ జెట్టి రామకృష్ణ,చిన్నబాబు,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: