- అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారా..
- సిపిఐ రాష్ట్ర నాయకులు రావులపల్లి రాంప్రసాద్ డిమాండ్...
మన్యం డెస్క్ ::
భద్రాచలం డివిజన్ లో దుమ్ముగూడెం, చర్ల మండలలో మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని భద్రాచలం డివిజన్ లో గ్రామాల్లో భద్రాచలం పట్టణo లో మద్యం బెల్ట్ షాపుల ద్వారా ఏరులై పారుతున్న ఆబ్కారీ శాఖ ఎందుకు స్పందించడం లేదని అన్నారు బడి గుడి అనే తేడా లేకుండా మద్యం వ్యాపారులు కుమ్మక్కై కనీస విలువలుపాటించకుండా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు అన్ని గ్రామాల్లో పట్టణంలోని కాలనీలలో విచ్చలవిడిగా మద్యం అర్ధరాత్రి దాకా అమ్మకాలు జరుపుతూ మహిళలు ప్రజలు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం తక్షణం స్పందించి మద్యం వ్యాపారులను కట్టడి చేయాలని అన్నారు.తక్షణమే ఆబ్కారీ శాఖ స్పందించి ఈ దోపిడీని అపకపోతే ఆబ్కారీ శాఖ కార్యాలయాన్ని దిగ్భంధనం చేస్తామని అన్నారు.ఈ సమావేశంలో సి పి ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మళ్ల వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి అకోజు సునిల్ కుమార్, బల్లా సాయి కుమార శివాజీ, భాస్కరరావు నర్సింహులు విశ్వనాద్, హిమాం ఖాసీం తదితరులు ఉన్నారు..
Post A Comment: