CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

Share it:

 


 మన్యం మనుగడ/ వాజేడు మే 14: 


భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య( డివైఎఫ్ఐ) మండల మహాసభ వాజేడు మండల కేంద్రంలో జరిగింది,ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా కార్యదర్శి దబ్బ కట్ల లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశాయని ఆరోపించారు, నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతకు జీవనోపాధి కొరకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో యువతను సమీకరించి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు, అనంతరం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నూతన మండల కమిటీ 12 మందితో ఎన్నుకోవడం జరిగింది, మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా బచ్చల కృష్ణబాబు గౌరారపు చంద్రశేఖర్ ను ఎన్నుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు జెజ్జరి దామోదర్, డివైఎఫ్ఐ నాయకులు బచ్చల కృష్ణబాబు,గౌరారపు చంద్రశేఖర్, కారం నవీన్, ప్రభాకర్, సాయి సృజన్,సోడి అర్జున్, సునీల్ సంతోష్, నాగరాజు ,సుమన్, రమేష్, సందీప్ పాల్గొన్నారు,

Share it:

TS

Post A Comment: