ములకలపల్లి:(మే12)
మన్యం మనుగడ ప్రతినిధి :
ములకలపల్లి మండల కమిటీ తరఫున ముకమామిడిగ్రామ పంచాయితీ, మొగరాల గుప్ప గ్రామంలో పాయం రవి అధ్యక్షతన ప్రగతిశీల యువజన సంఘం ఆద్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుపుత్వాల ప్రజా వ్యతిరేక విదానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ కార్యదర్శి కొర్సా. రామకృష్ణ పాల్గొని మాట్లాడుతు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల మీద నిత్యావసర ధరలు పెంచి పెట్రోల్.డీజిల్,వంట నూనె పెంచి సామాన్య ప్రజల మీద ఉరితాడుబిగించిన ప్రభుత్వాలు వెంటనే దిగివచ్చి,నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల ( ప్రగతిశీల యువజన సంఘం) కమిటీ సభ్యులు కొరస శ్రీకృష్ణ,కోండ్రు శ్రీను,మడకం రాజులు,కోర్స వెంకటేష్,తానం పవన్, స్వయం సర్వేశ్వరరావు గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: