మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామంలో కారం రాజుకు చెందిన ఇళ్లు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ కుటుంబాన్ని పినపాక తహసిల్దార్ విక్రమ్ కుమార్ ఆదుకున్నారు. గ్రామంలో ఇంటికి మంటలు అంటుకున్న అన్న విషయం తెలుసుకున్న తహసిల్దార్ విక్రమ్ కుమార్ ఆ ప్రదేశానికి వెళ్లి పరిస్థితి గమనించి, కారం రాజు కుటుంబ సభ్యులకు వెంటనే మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.మానవతా దృక్పథంతో సాయం అందించిన తాసిల్దార్ గొప్పతనం గురించి పలువురు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సహాయం త్వరగా అందే విధంగా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చింతపంటి సత్యం, మండల గిర్దావర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: