మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 6 మండల పరిధిలోని జూలూరుపాడు రేంజ్ సూరారం గ్రామం, రాజుపాలెం బీట్ పరిధిలోని, కొర్స చంద్రమ్మ రిజర్వ్ ఫారెస్ట్ లో పోడు భూమిలో అనుమతులు లేకుండా బోర్ వేస్తున్న బోర్ బండి లారీని, గురువారం తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో విశ్వాసనియ సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది బోర్ బండిని స్వాధీనం చేసుకొని మండల కేంద్రంలోని ఎఫ్ ఆర్ ఓ కార్యాలయానికి తలలించారు. ఇట్టి విషయమై ఎఫ్ఆర్ఓ ప్రసాదరావును వివరణ కోరగా మండల పరిధిలోని సూరారం గ్రామం నందు పోడు భూముల్లో అనుమతులు లేకుండా బోర్ వేస్తుంటే, నమ్మదగిన సమాచారం మేరకు, బోర్ బండిని స్వాధీనం చేసుకొని ఎఫ్ఆర్ఓ కార్యాలయానికి తరాలలించామని, ఇట్టి వాహన వివరాలు, నల్గొండ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ రెడ్డి, జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన చీపు శ్రీను ఏజెంట్ గా నడిపిస్తున్నాడని, విచారణలో తెలిసిందని, ఇట్టి వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి డిఎఫ్ఓ కార్యాలయానికి అందజేశామని, పై అధికారుల సూచన మేరకు చర్యలు, తీసుకుంటామని తెలిపారు.
Post A Comment: