CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మున్నూరుకాపు సంఘం ఆద్వర్యంలో పేద విద్యార్దికి ఆర్దిక సహాయం అందజేత.

Share it:

 



మన్యం టీవీ చర్ల:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మున్నూరుకాపు సంఘం ఆద్వర్యంలో సోమవారం చర్లలో పేద విద్యార్దికి ఆర్దిక సహాయం అందచేసారు.చర్ల కు చెందిన పటేల్ వెంకటేశ్వరరావు కుమారుడు పటేల్ పృద్వి ఉన్నత చదువుల నిమిత్తం మున్నూరుకాపు సంఘ సభ్యుల నుండి సేకరించిన రూ. 1 లక్ష 20 వేల నగదును సోమవారం చర్లలోని స్వామినాయుడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆదర్శ రైతు జవ్వాది జయకుమార్ ( జయబ్బాయి ) చేతుల మీదుగా విద్యార్ది తండ్రి వెంకటేశ్వరావుకు అందచేసారు. ఈ సందర్బంగా జయకుమార్ మాట్లాడుతూ విద్యార్ది ఉన్నత చదువుల కొరకు వితరణ అందచేయడం అబినందనీయమని అన్నారు. ఇటువంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. విద్యార్ది పృద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్దితికి చేరుకొని మరికొంతమంది పేద విద్యార్దులకు ఆర్దిక సహాయం అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో మున్నూరుకాపు సంఘం మండల అద్యక్షుడు విస్సా నాగభూషణం, మండల కోఆర్డినేటర్ గుండేపూడి బాస్కర్ రావు, జవ్వాది రవికుమార్, జవ్వాది మురళీకృష్ణ, పుప్పాల ముత్తయ్య, ఎడ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

మరోమారు దాతృత్వం చాటుకున్న జవ్వాది కుటుంబం,చర్లకు చెందిన జవ్వాది కుటుంబం మరోమారు దాతృత్వం చాటుకున్నారు. పృద్వి ఉన్నత చదివుల నిమిత్తం ఆ కుటుంబం రూ. 50 వేల ఆర్దిక సహాయం అందచేసారు. గత నెలలో దుమ్ముగూడెం మండలానికి చెందిన పేద క్రికెట్ క్రీడాకారిణికి రూ . 25 వేల ఆర్దిక సహాయం, చర్లకు చెందిన పేద ఎం బి బి ఎస్ విద్యార్దినికి రూ. 5 వేలు ఆర్దిక సహాయం అందచేసిన విషయం విదితమే మరోమారు ఆ కుటుంబం విద్యార్దికి రూ. 50 వేల అందచేయడం పట్లు పలువురు అబినందించారు.

Share it:

TS

Post A Comment: