CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భగీరథుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎంపీపీ.

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో భగీరథుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భగీరథుడు గంగను భూమి మీదకు తీసుకు రావడానికి కొన్ని వందల సంవత్సరములు తపస్సు చేయడం జరిగిందనీ, ఆయన తమ యొక్క, పితృల రుణం తీర్చుకోవడానికి గంగాదేవిని భూమి మీదకు తీసుకు రావడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బంగారు తెలంగాణ రైతన్నల కళ్లల్లో ఆనందం చూడాలి అనే ఉద్దేశంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరియు సీతారామ ప్రాజెక్టు బహుళసాగర్ ప్రాజెక్టు కొరకు నిరంతరం శ్రమిస్తున్న అపర భగీరధుడు కెసిఆర్, రైతులకు కొన్ని వేల ఎకరములు భూమి నీరు అందించి పంట దిగుబడి పెంచి ఎంతోమంది దాహార్తిని తీరుస్తున్నరన్నారు. ఆ మహనీయుని అయినా భగీరథ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ అధికారకంగా జయంతి ఉత్సవాలు జరపడం హర్షించదగ్గ విషయం గా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు ఎంపీటీసిలు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: