వెల్కం టూ తెలంగాణ అమిత్ షా జీ.. మా ప్రజలకు ఏం చెబుతారు
తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకంత వివక్ష
తెలంగాణ పర్యటనకు నేడు విచ్చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు రావలసిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి మీ సమాధానం ఏమిటని అడిగారు. పెట్రో ధరలు, గ్యాస్ ధరల పెంపుపై ఏం చెబుతారన్నారు.
దేశ హోంమంత్రి అమిత్ షాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు
రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?
బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ. 2247 కోట్ల సంగతేమిటి?
ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి మీ సమాధానం ఏంటి?
బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం మరియు మతపరమైన అల్లర్ల గురించి ఏం చెబుతారు?
పెట్రో ఉత్పత్తులు మరియు ఎల్పీజీని విక్రయించడంలో భారత్ను అత్యంత ఖరీదైన అగ్రగామి దేశంగా మార్చడంపై ఏం మాట్లాడుతారు?
ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించండి.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ. 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పండి.
కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా?
Post A Comment: