గుండాల/ఆళ్లపల్లి మే8(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నిర్వహిస్తున్న రేగా విష్ణు ట్రస్ట్ ఆధ్వర్యంలో మర్కోడు గ్రామంలో ని అంబేద్కర్ కాలనీ లోకంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రేగా విష్ణు ట్రస్ట్ వచ్చిన డాక్టర్ కండే దేవేందర్ వృద్ధులకు వంటి పరీక్షలను నిర్వహించారు. మారుమూల గ్రామంలో కంటి వైద్య నిర్వహిస్తున్న రేగా కాంతారావు కు ధన్యవాదాలు అని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కంటి పరీక్షల అనంతరం ఆపరేషన్ నిర్వహించ వలసి వస్తే వారికి రేగా ట్రస్టు ద్వారా ఉచితంగానే ఆపరేషన్ కూడా చేయిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, సర్పంచ్ శంకర్ బాబు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , సోషల్ మీడియా అధ్యక్షులు సందీప్, నాయకులు కీసరి నరేష్ , సమ్మయ్య, కంచర్ల రవి, ప్రసాద్, రమేష్ , దొడ్డి రాము తదితరులు పాల్గొన్నారు
Post A Comment: