దమ్మపేట ఏప్రిల్ 11 ( మన్యం మనుగడ ) : నిత్యావసర వస్తువుల రేట్లను విద్యుత్ చార్జీలను తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లను తగ్గించాలని దమ్మపేట మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ స్థానిక తాసిల్దార్ రంగా ప్రసాద్ కి మెమోరాండం జరిగింది .
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం వర్కింగ్ కార్యదర్శి యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలన నడుపుతున్నారని నిత్యవసర వస్తువుల రేట్లను గ్యాస్ పెట్రోల్ డీజిల్ విద్యుత్ చార్జీలను అద్దూ అదుపు లేకుండా విపరీతంగా పెంచి పేదప్రజల నడ్డి విరుస్తున్నారని పెంచిన నిత్యావసర వస్తువుల రేట్లు అన్ని వెంటనే తగ్గించాలని లేనియెడల దశలవారీగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని ప్రతి వ్యవసాయ కార్మికులకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి సంవత్సరానికి 15 వేల రూపాయలు ఇవ్వాలని దళితులు అందరికీ దళిత బంధు వర్తింపజేయాలని ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని రైతు రుణమాఫీ లక్ష రూపాయలు వెంటనే అమలు చేయాలని లేనియెడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని పేదల గుర్తించి ఇళ్లస్థలాలు డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని లేని ఎడల ప్రభుత్వ భూములు గుర్తించి పేద వాళ్లకు పంచుతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పండూరు వీరబాబు ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి సుంకు పాక ధర్మ మండల సహాయ కార్యదర్శి ఎస్కే దస్తగిరి మహిళా సమాఖ్య కార్యదర్శి జానీ బేగం తుపాకుల శాంతి రైతు సంఘం నాయకురాలు వీరలక్ష్మి గిరిజన సంఘం కొర్స వెంకటేష్ కూరం ప్రసాద్ ఏ ఐ టి యు సి నాయకులు నల్ల ప్రసాద్ జాన్ బి గాజు బోయిన కృష్ణవేణీ వెంకటేష్ నక్క నాగమణి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బెల్లం కృష్ణవేణి నాగ కుమారి అంజలి భద్రతా ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: