దమ్మపేట మే 19 ( మన్యం మనుగడ ) : వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెనుబల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో బీజేపీ దిష్టి బొమ్మను తగుల పెట్టడం జరిగింది. ఈ కార్య క్రమంనకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నరాల సత్యనారాయణ హాజరై ప్రసంగించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను వెనక్కి తీసుకోవాలని అమిత్ షా వ్యాఖ్యానించడం సరికాదని హెచ్చరించారు. భారత దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటాము. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశాన్ని కులం పిచ్చితో, మతం పిచ్చితో వేరు చేయడాన్ని చూస్తుంటే, అమిత్ షా మతకల్లోలాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని,లేని పక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఇంఛార్జి జన్ భి, యువజన విభాగం ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాముల వెంకటేశ్వరరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు చక్రాల శ్రీను, మండల నాయకులు పాకనాటి శ్రీను, నాయకులు వెంకటేష్ , శ్రీకాంత్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: