మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండల పరిధిలోని సీతానగరం గ్రామం లో సర్వే నంబర్ 18 19 20 గల ప్రభుత్వ భూమి గిరిజనేతరులు కబ్జాలో ఉందని అట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేద కుటుంబాల అందజేయాలని ఏవిఎస్పి డివిజన్ అధ్యక్షులు సొందే మల్లు దొర డిమాండ్ చేశారు. మండల పరిధిలోని సీతానగరం గ్రామంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూమి సుమరూ 7.5 ఎకరాలు కబ్జాలో ఉందని భూమిని గిరిజనేతరు లు లీజుకు ఇస్తూ అక్రమంగా లబ్ధి పొందుతున్నారని ఆ భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనపర్చుకున్నారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏవిఎస్పి తరుపున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హరికృష్ణ ,బీమారాజు, నరసింహారావు ,వెంకటరామన్, మురళి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: