గుండాల మే 14(మన్యం మనుగడ) ములుగు జిల్లా మంగపేట మండలం శనగ కుంట అగ్ని ప్రమాద బాధితులను ఆదివాసి గురుకుల ఉపాధ్యాయులు ఆదుకున్నారు. శనివారం శనగ కుంట గ్రామానికి వెళ్లి 25 వేల రూపాయల విరాళంను ధన సరి సూర్య చేతులమీదుగా బాధితులకు అందజేశారు. అనంతరం సూర్య మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాధితులను గురుకుల ఉపాధ్యాయుల ఆదుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గోగ్గెల రమేష్ జోగా పోతయ్య, ములకలపల్లి ప్రిన్సిపల్ రాజేష్ , పి దుర్గ అ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: