మన్యం మనుగడ ఏటూరునాగారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఏర్పాటు చేసిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సోమవారం వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవ రెడ్డి గోగుపల్లిలో ప్రారంభించారు. ముందుగా గోగుపల్లి గ్రామానికి మంజూరైన పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్మించి విద్యా బోధన చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గోగుపల్లిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా మన ఊరు మన బడికి పంపించి మెరుగైన విద్యాబోధన పొందాలని సూచించారు. అంతేకాకుండా విద్యార్థులకు మెరుగైన విద్య కోసం మంత్రి, కలెక్టర్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చొరవతో మరో నూతన భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువుతో విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు పాఠశాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు కృషి చేస్తానని వైస్ ఎంపీపీ హామీ ఇచ్చారు. ముందుగా 30 లక్షలతో మంజూరైన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెరుకుల ధర్మయ్య, ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ లక్ష్మయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: