మన్యం మనుగడ, అశ్వారావుపేట:ఆదివాసి జాతి "మనుగడకై, జల్ -జంగిల్ -జమీన్" మా గ్రామంలో మా రాజ్యం అనే నినాదంతో నిరంకుశ పాలకుల నిజాం నవాబుకు వ్యతిరేకంగా 1928 నుండి 1942 వరకు వీరోచితంగా పోరాటం చేసి, ఆదివాసి జాతిని చైతన్య పరిచి ఆదివాసి గుండెల్లో కొలువై యావత్ జాతికి ఆరాధ్యుడైన కొమరం భీమ్ స్పూర్తిని స్మరించుకుంటూ శుక్రవారం నాడు అశ్వారావుపేట మండలం, బచ్చువారిగూడెం గ్రామంలో ఆదివాసి యూత్ ఆధ్వర్యంలో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బంధం ఉపేందర్ రావ్ కు బచ్చువారి గూడెం గ్రామం ఆదివాసి యూత్ కరపత్రం అందించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కమిటీ సభ్యులు కుంజా రాముడు, మడకం హరీష్, మడకం రాజు, బంధం అరవింద్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: