గుండాల/ఆళ్ల పల్లి మే 24(మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలం లో పర్యటించిన జిల్లా కలెక్టర్ అనుదీప్. మండలంలో గిరి వికాస్ పథకం ద్వారా వేసిన బోర్లను ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలోని పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. స్థానిక ప్రాథమిక వైద్యశాల ను సైతం సందర్శించి రిజిస్టర్ ను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మర్కోడు గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ని సందర్శించిన కలెక్టర్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలను చక్కగా పెంపొందించ ఉన్నారని కితాబిచ్చారు. ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి కలెక్టర్ అనుదీప్ కు సమస్యలు వివరించడంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నజియా సుల్తానా, ఎంపీపీ మంజు భార్గవి, ఎంపీడీవో మంగమ్మ, విద్యుత్ శాఖ ఏడి, ఏఈ రవి, ఎం ఈ ఓ కృష్ణయ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
Post A Comment: