మన్యం, మనుగడ, దుమ్ముగూడెం::
ఈనెల 9న భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేయాలని ఆదివాసి సిద్ధం కావాలని కోరుతూ ఎఎస్పి ,ఏవిఎస్పి పిలుపు ఇచ్చారు. దుమ్ముగూడెం మండలంలో చిన్న బండిరేవ్ గ్రామంలో లో బడిస నరసింహరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో లో ఏవిఎస్పి డివిజన్ అధ్యక్షులు సొందే మల్లు దొర మాట్లాడుతూ జీవో నెంబర్ 3 పటిష్టం చేయాలని ఆదివాసీ నియోజవర్గ ఎమ్మెల్యే జీవో నెంబర్ 3 కోరుతూ ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఆదివాసులు అసెంబ్లీలో ఆర్డినెన్స్ ద్వారా 100/: రిజర్వేషన్ కల్పించాలని 1/70 చట్టం లో ఏజెన్సీ ఏరియా పటిష్టంగా అమలు చేయాలని కోరారు ఆదివాసులకు వెన్నుముక లాంటి చట్టం ఆదివాసులు అన్నం పెట్టే చట్టం జీవో నెంబర్ 3 అన్నారు దీన్ని గిరిజనేతరులకు పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కావున ఆదివాసి నిరుద్యోగులు ఆదివాసీ ప్రజానీకం ఈనెల 9న భారీగా తరలి వెళ్లి భద్రాచలం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంతో మాట్లాడే విధంగా చేయాలని అని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోయం రమేష్ ,రామకృష్ణ, రాము, సోమరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: