భద్రాచలం. మే. 25. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులందరూ ఒత్తిడి అధిగమించి మానసికంగా మరియు శారీరకంగా పూర్తి గా సన్నద్ధమై పరీక్షలు రాయాలని అందరూ మంచి ఉత్తీర్ణత పొందాలని ఈ మేరకు శ్రీరామ్ మిల్క్ పాయింట్ యజమాని ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్న తనం లో తాను చదువుకున్న భద్రాచలం పట్టణంలోని శ్రీ సాధన పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష పాడ్స్ మరియు స్టేషనరీ అందజేశారు, విద్యార్థులకు పరీక్షా సమయం లో నీరసం రాకుండా వారానికి సరిపడా ORS ప్యాకేట్స్ కూడా వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తాను చదువుకున్న స్కూల్ లో ఇలా విద్యార్థుల కు ఇలా చేయటం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థి MD. షాజహాన్, లగడపాటి వేణు, కడాలి నాగరాజు, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: