మన్యం మనుగడ వాజేడు మే 25:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక సంక్షేమ పథకం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, పథకాలతో పెళ్లయిన తెలంగాణ ఆడబిడ్డలకు లక్ష నూట పదహారు రూపాయలు హార్దిక సహాయ చేస్తున్నారు.కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ. 1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల శారద, స్థానిక సర్పంచ్ తల్లడి ఆదినారాయణ ,ఎంపీడీవో విజయ, ఎమ్మార్వో సర్వర్ పాషా, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: