మన్యం మనుగడ, అశ్వారావుపేట:అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐ బాలకృష్ణను అశ్వారావుపేట ఐక్యత ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ్యులు సీఐ కు వివరించారు. అదేవిధంగా అశ్వారావుపేట ప్రధాన రహదారుల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని సీఐ ను కోరారు. ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్సు లు ఉదయరాఘవేంద్ర, సత్యనారాయణ, కోశాధికారి కొర్రి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గంధం వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి ముళ్లగిరి రమేష్, జుజ్జారపు రాంబాబు, నార్లపాటి సోమేశ్వరరావు, కూనా చిన్నారావు, మద్దు రవి, దాది చంటి, మంగరాజు, వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: