మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం సీఎస్పీ కాటా దగ్గర ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా 14 టైర్స్,టిప్పర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే జెండాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ,దేశ, రాష్ట్రాభివృద్ధిలో కార్మికులది కీలక భాగస్వామ్యమన్నారు. మేడే స్ఫూర్తితో సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదర్శవంతమైన కార్మిక,కర్షక, విధానాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర పారిశ్రామిక విధానంతో సంపద సృష్టించడంతో పాటు,ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక పక్షం శ్రమజీవుల శ్రేయస్సు సీఎం కేసీఆర్ లక్ష్యం ఆయన అన్నారు.ఈ సందర్భంగా పలువురు కార్మికులను శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి,జడ్పీటీసీ పొశం.నరసింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రామిరెడ్డి,నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు, అభిమానులు,పార్టీ సీనియర్ నాయకులు,14 టైర్స్&టిప్పర్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: