మన్యం టీవి దుమ్ముగూడెం::
మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర లో భాగంగా దుమ్ముగూడెం మండల బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్ సరియం భీమ్ సంఘీభావ యాత్ర, పార్టీ నిర్మాణం దిశగా దబ్బనూతుల గ్రామాన్ని సందర్శించి బిఎస్పి ని ఏనుగు గుర్తును పరిచయం చేస్తూ ప్రవీణ్ కుమార్ అభిమానులతో మాట్లాడుతూ యాత్రను జయప్రదం చేసి అధికార పీఠాన్ని అధిరోహించి మన హక్కులు, చట్టాలు సాధించే దిశగా అడుగులు వేయాలని, భవిష్యత్తులో మన జాతి మనుగడకు మనమే పునాదులు అవ్వాలని పిలుపునిచ్చారు. అక్షరం ఆరోగ్యం ఆర్ధికం అవే ముఖ్య ఎజెండాగా బీఎస్పీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుందని, ప్రతి బహుజనుడికి ఉచిత విద్య, వైద్యం అందేలా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం, భారత రాజ్యాంగమునే మేనిఫెస్టోగా ప్రకటించుకున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు చెన్నం నాగరాజు, సోందే జనకిరావు, ముద్దరాజు, క్రిష్ణ, సురేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: