మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 25 మండల కేంద్రంలోని పురుగు మందుల షాపుల్లో జిల్లా టెక్నికల్ వ్యవసాయ సంచాలకులు జి లాల్ చంద్ ఆధ్వర్యంలో బుధవారం అకస్మికంగా తనఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్ చంద్ మాట్లాడుతూ.. మండల పరిధిలోని పురుగు మందుల షాపుల్లో ఎవరైన నకిలీ విత్తనాలు అమ్మిన, లేదా ప్రభుత్వ నిషేధిత హెచ్ టి పత్తి విత్తనాలు అమ్మిన, నిషేధిత గ్లైపో సెట్ నిల్వ ఉంచినా, అమ్మినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో టాస్క్ఫోర్స్ ఎస్ఐలు జితేందర్, తిరుపతి, మండల ఏఓ రఘదీపిక తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: