CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక మండలానికి నిధుల మంజూరు పట్ల హర్షం.మారుమూల గ్రామాల రోడ్లు అభివృద్ది రేగాకే సాధ్యం

Share it:


  • మునుపటి పాలకులు అభివృద్ధి మరిచార
  •  పినపాకకు రూ.4 కోట్ల 52 లక్షలు మంజూరు 

మన్యం మనుగడ, పినపాక :


మారుమూల గ్రామాల అభివృద్ధిలో భాగంగా రోడ్లు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే,టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నిధులు మంజూరు చేయించడం పట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కమిటీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ, మారుమూల గ్రామాల అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పని చేస్తున్నారన్నారు. అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో రైతులకు అనుకూలత సాధ్యమవుతుందన్నారు. అభివృద్దే ప్రధాన ఎజెండాగా మా నాయకుడు రేగా కాంతారావు గారు పని చేస్తున్నారన్నారు. 


పినపాక మండలంలో 

1) భూపతిరావుపేట నుండి సుందరయ్యనగర్‌ వరకు బీటీ రోడ్డుకు రూ.1 కోటి 56 లక్షలు 

2) కిష్టాపురం నుండి పిట్టతోగు వరకు బీటీ రోడ్డుకు రూ.2 కోట్ల 96 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. 


ఈ నిధులు మంజూరుకు సహకరించిన మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కి, ఎంపీ కవిత కి ప్రభుత్వ అధికారులకు టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ, సీనియర్‌ నాయకులు దాట్ల వాసుబాబు, బత్తుల వెంకటరెడ్డి, ఎగ్గడి శ్రీరామ్‌ మూర్తి, కటకం గణేష్‌, సోంపల్లి తిరపతి, గాండ్ల అశోక్‌, యాంపాటి సందీప్ రెడ్డి, శ్యామల సతీష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: