మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని
బోర్ నర్సాపురం- తిమ్మంపేట గ్రామాల మధ్య గోదావరి నది ఒడ్డున గడ్డచేను దగ్గర పోతురాజు మాగ చెట్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఎల్.టి విద్యుత్ తీగలు కాసారం గాలికి కిందపడగా, మేతకోసo వెళ్లిన తిమ్మoపేట,బోరునర్సపురం గ్రామాలకి చెందిన రైతుల పాడిగేదలకు విద్యుత్ వైర్లు తగిలి 7 పాడి గేదెలుఅక్కడికక్కడే మృతి చెందాయి. మృతిచెందిన గేదల విలువ రూ,5 లక్షల వరకు ఉంటాయని బాధిత కుటుంబాల రైతులు విలపిస్తున్నారు. ట్రాన్స్కో మంగపేట ఏ.ఈ శ్రీధర్ సంఘటన ప్రాంతాన్ని సందర్శించి ప్రమాదాన్ని పరిశీలించారు. పంచనామానిర్వహించారు. ట్రాన్స్కో అధికారులు సంబంధించిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాధిత రైతులను ఇంకా గుర్తించలేదని ఏ.ఈ వెల్లడించారు.
Post A Comment: