CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులకు రాయితిపై జిలుగు విత్తనాలు పంపిణీ.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం:మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శనివారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా చేతుల మీదుగా రాయితీపై జీలుగు విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 

ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని రైతులు పంటలు ప్రభుత్వ అనుగుణంగా పండించాలని కోరారు. రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేసారు. అలాగే జీలుగ విత్తనాలతో పచ్చిరొట్ట ఎరువులు చేసుకుని భూసారాన్ని పెంచుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో కరకగూడెం,బట్టుపల్లి సర్పంచులు ఊకె రామనాధం,తోలెం నాగేశ్వరరావు, ఏవో వినయ్,ఏఈఓ ప్రశాంత్, పిఎసీఎస్ డైరెక్టర్ రావుల కనకయ్య, టీఆర్ఎస్ నాయకులు రేగా సత్యనారాయణ,సయ్యద్ అజ్జు,కార్యాలయ సిబ్బంది చందా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: