మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలంలో సింగవరం గ్రామంలో ఐటీసీ బంగారు భవిష్యత్తు సహకారంతో సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ఆదర్యంలో రైతులకు అంతర్జాతీయ జీవవైవిద్యం దినోత్సవం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ప్రకృతిలో సకల జీవరాసులకు జీవనం పరస్పర ఆధారితం, జీవవైవిద్యం లో కీలకమైన జంతు, వృక్ష జాతులు, వన్యప్రాణుల సంతతి వేగంగా అంతరించిపోవడం ఆందోళన కలిగించే అంశం కావున మనమందరం చైతన్య వంతులై జీవవైవిద్య పరిరక్షణకు కృషి చేద్దాం అని రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్, కమ్యూనిటి ఆర్గనైజర్ తిరుపతిరావు, గ్రామ సర్పంచ్ కొండయ్య, నాగరాజు రైతులు హాజరయ్యారు..
Post A Comment: