మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: గుండెపోటుతో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలి మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. రవికంపాడు గ్రామానికి చెందిన అనంగి వెంకటేశ్వర్లు(60) గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం పనులకు వెళ్లి తోటి కూలీలతో కలిసి పనుల్లో నిమగ్నమవ్వగా అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో వెంటనే ప్రక్కనే ఉన్న కూలీలకు చెప్పడంతో వెంటనే, వాహనంలో చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యలు పరీక్షించి మార్గం మధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఎంపీడీవో అన్నపూర్ణ పరిశీలించి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం కలరు.
Post A Comment: