మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని సమితి సింగారం గ్రామ పంచాయతీలో నందు గల ట్రైబల్ కమ్యూనిటీ హాల్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ మంగళవారం నాడు అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా పనుల వివరాలు కల్పించవల్సిన సదుపాయలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు కారం.విజయకుమారి,గుమ్మడి. గాంధీ,ఎంపీటీసీల సంఘం జిల్లా,కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,ఎంపిఓ వెంకటేశ్వర్లు,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,టిఆరేస్వి నాయకులు,పంచాయితీ రాజ్ శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: