CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేసీఆర్ ఒక ప్రభంజనం.అభివృద్ధి, సంక్షేమం ఆయనకు రెండు కళ్ళు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న రేగా

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని రైతు వేదిక నందు మండల వ్యాప్తంగా 44 మంది లబ్ధిదారులకు మంజూరైన 44 లక్షల రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు శుక్రవారం ప్రజా ప్రతినిధులతో కలిసి పినపాక రైతు వేదిక నందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కరోనా సంక్షోభం లోనూ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు అయ్యాయని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆసరాగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు,పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుక గా 1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కారు అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని అన్నారు. కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలు అమలు లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మన్నారు.

 ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: