మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం లో ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి అని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మణుగూరు నందు టైలర్ షాప్ కి స్వయంగా వెళ్లి తనకు సంబంధించిన కొలతల ఇచ్చి,ట్రైలర్స్ ను ప్రోత్సహిస్తూ తన చేనేత వస్త్రాలను కుట్టుటకు టైలర్ వద్దకు వెళ్లి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి అని చేనేత వస్త్రాలకు,ప్రాధాన్యం ఇవ్వాలనే సదుద్దేశంతో చేనేత కార్మికులకు సామాజిక న్యాయం చేయడానికి,చేనేత కార్మిక రంగానికి ఉపాధి కల్పించే దిశగా,సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత రంగంలో పాటు అన్ని రంగాలలో కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అన్నారు.ముఖ్యంగా చేనేత రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,ఆదివాసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు అనిల్ కుమార్,నాయకులు వట్టం రాంబాబు,పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: