CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరి వికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి :- పిఎసిఎస్ చైర్మన్ రామయ్య

Share it:



గుండాల మే 10(మన్యం మనుగడ) గిరి వికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ జి. రామయ్య రైతులకు సూచించారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం అడవి రామారం గ్రామాన్ని టిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. అక్కడ వేసిన గిరి వికాస్ పథకం ద్వారా వేసిన బోర్లను వారు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రహదారులకు నిధులు మంజూరు చేయించిన ఘనత రేగా కు దక్కుతుందన్నారు. మర్కోడు నుండి అడవి రామారం, సాయన పల్లి నుండి అడవి రామారం రోడ్లకు నిధులు మంజూరు చేయించడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఏండ్ల నాటి కల నెరవేర్చిన రేగాకు గ్రామస్తులు ధన్యవాదాలు పేర్కొంటున్నారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, సర్పంచ్ శంకర్ బాబు, వెంకట్ నారాయణ, ఈసారి నరేష్ , వేమూరి రాంబాబు, కంచర్ల రవి,బొమ్మెర ముసలయ్య, సమ్మయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: