మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 5 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న కారేపల్లి, గార్లఒడ్డు, నాచారం, పాపకొల్లు, సుజాతనగర్ ఎండోమెంట్ దేవాలయాలలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి ( ఈఓ) గా విధులు నిర్వహిస్తున్న భీమవరపు సూర్యప్రకాష్ రావు ఆలయాలలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కారేపల్లి మండలం కు చెందిన వాసిరెడ్డి సంపత్ కుమార్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, స్పందించిన జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు గురువారం పాపకొల్లు శివాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎండోమెంట్ ఇన్ స్పెక్టర్ వెల్ సింగ్ మాట్లాడుతూ.. ఈఓ సూర్యప్రకాష్ రావు అవినీతి ఆరోపణల ఫిర్యాదుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన పనిచేస్తున్న దేవాలయాలలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయాలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని తనిఖీ చేస్తున్నామని అన్నారు. విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, తదుపరి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ సిబ్బంది ఆనంద్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: