మన్యం మనుగడ వాజేడు మే18
వాజేడు మండలం చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన బొల్లె శ్రీరాములు,గౌరీల ఏకైక కూతురు బొల్లె గీతాంజలి. ఈరోజు మధ్యాహ్నం ఎంజీఎం హాస్పిటల్ గుండెపోటుతో మృతి చెందారు. కళాశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చెప్పిన వివరాల ప్రకారం. వాజేడు కస్తూర్బా గాంధీ కళాశాల హాస్టల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు,గత రెండు రోజులుగా కాళ్లు వాపులు వచ్చాయని ప్రధానోపాధ్యాయురాల దృష్టికి తీసుకెల్లగా తక్షణమే తల్లి తండ్రికి తెలియపరిచారు.వారు అత్యవసర చికిత్స అందించేందుకు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తీసుకెళ్లగా చికిత్స జరుగుతుండగా నే మధ్యాహ్నం సమయములో గుండె పోటుతో బుధవారం ఉదయం తుది శ్వాస విడిచింది. కుటుంబ సభ్యులు బంధు మిత్రులు బాలిక మృతి పట్ల కన్నీరుమున్నీరయ్యారు.
Post A Comment: