CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనికి చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ దయానంద స్వామి

Share it:

  


మన్యం మనుగడ కరకగూడెం : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డా. దయానంద స్వామి సిబ్బందికి సూచించారు.ఈ మేరకు ఆయన మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కెంద్రన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆశాడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆస్పత్రిలోని రికార్డులను తనిఖీ చేసిన ఆయన సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించారు. రోగుల వార్డుల కలియతిరగని ఆయన రోగులకు అందుతున్న వైద్యసేవలు పై ఆరా తీశారు. కోవిడు వ్యాక్సినేషన్ తీరును అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మందుల గదిలో మందులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డా.పర్షియానాయక్, వైద్య సిబ్బంది,ఆశాకర్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: