మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా గత రెండు సంవత్సరాలుగా పరీక్షలకు దూరమైన విద్యార్థులు శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఆనందంగా హాజరయ్యారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపారు. నిర్ణయించిన సమయానికి నిమిషం లేటుగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమనే నిబంధన ఉండటంతో విద్యార్థులంతా గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద శానిటేషన్, మెడికల్ క్యాంపు, త్రాగు నీటి వసతి ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రంలో మొత్తం 170 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 157 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల పరీక్ష కేంద్రాన్ని కొత్తగూడెం ఆర్డిఓ స్వర్ణలత, స్థానిక తాహశీల్దార్ లూధర్ విల్సన్, ఎం ఈ ఓ వెంకట్ సందర్శించారు. మొత్తం మీద ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ముగిశాయి.
Post A Comment: