మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు పినపాక మండల కమిటీ ఆధ్వర్యంలో జానంపేట, దుగినేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్స్, కంబాక్స్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమమైన భవిష్యత్ దృశ్య ఉన్నతమైన చదువులు చదివి దేశానికి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుదిగొండ రామకృష్ణ , ప్రధానోపాధ్యాయులు రమణ, దుగినేపళ్లి ప్రధానోపాధ్యాయులు హనుమంతు, డివిజన్ అధ్యక్షులు దాసరి రవి, డివిజన్ ఉపాధ్యక్షుడు కోడిరెక్కల రమేష్, మండల అధ్యక్షుడు బోడ సర్వేశ్ ఉపాధ్యక్షుడు యాస ఇశ్రాయేలు, ప్రధాన కార్యదర్శి చీకటి రఘు, రాజు, మాలా మహానాడు పినపాక మండల కమిటి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: