మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండలంలో ఇసుక మట్టి మాఫియాదారులు పెట్రేగి పోతున్నారు.అడ్డుకుంటే వారు ఎంతటివారైనా వాళ్ల అంతుచూస్తాం అనేస్థాయికి ఎదిగిపోయారు. ఈ మాఫియా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులపై తిరగబడ్డ సంఘటన గురువారం తెల్లవారుజామున మండలంలోని తిప్పన పల్లి గ్రామ సమీపంలో ఎద్దుళ్లవాగులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై జూలూరుపాడు సీఐ వసంత్ కుమార్ గురువారం చండ్రుగొండ పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు.ఎద్దుళ్లవాగులో ఇసుక ట్రాక్టర్ నింపుతున్న సమాచారం తెలుసుకొని తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఎస్ఐ విజయలక్ష్మి తన సిబ్బందితో వాగులోకి వెళ్లారు.ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ ని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేస్తుండగా తిప్పనపల్లి కి చెందిన నడ్డి రవికుమార్ ట్రాక్టర్ కు అడ్డుగా నిలబడి పోలీసులతో ఘర్షణకు దిగాడు. తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది.దీంతో నడ్డి రవికుమార్ ట్రాక్టర్ లోని ఇసుకను వాగులో ఆర్లోడ్ చేసి వెళ్ళిపోగా పోలీసులు ఖాళీ ట్రాక్టర్ ను స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్ ను సీజ్ తోపాటు నడ్డి రవికుమార్ పై పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Navigation
Post A Comment: