మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని ఎస్ఐ గొల్లపల్లి విజయలక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక మసీద్ నందు టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు తనయుడు ఉప్పతల పివి కుమార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేద ముస్లింలకు రంజాన్ సరుకులను ఆమె చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రసంగించారు.అన్ని మతస్తులు కలిపి జరుపుకునే పండుగ రంజాన్ పండుగ అని, అటువంటి పండుగను టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు తనయుడు ఉప్పతల పివి కుమార్ సహకరించటం, పేదలను ఆదుకునే కార్యక్రమం చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు గాదె శివప్రసాద్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, మాజీ ఎంపిటిసి చాపలమడుగు వెంకటేశ్వర్లు, మసీద్ కమిటీ బాబా, రఫీ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: