గుండాల మే 16(మన్యం మనుగడ) మండలం పరిధిలోని పల్లి గ్రామానికి చెందిన తోలెం లక్ష్మయ్య కుటుంబాన్ని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరామర్శించి కుటుంబ సభ్యులకు రేగా విష్ణు ట్రస్ట్ ద్వారా 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. లక్ష్మయ్య గత కొద్ది రోజుల క్రితం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో పార్టీ తరఫు కూడా ఆదుకునే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, వట్టం రాంబాబు, గుండాల మండల అధ్యక్షులు తేల్లం భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, గడ్డం రమేష్ , నిట్ట రాములు, అబ్దుల్ నబీ, తాటి కృష్ణ , మల్లయ్య , టిడిపి మండల అధ్యక్షులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: