CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల సమస్యను పరిష్కరించాలి.

Share it:

 


గుండాల/ ఆళ్ల పల్లి మే 7(మన్యం మనుగడ) రాష్ట్ర ప్రభుత్వం భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. శనివారం మండలంలో పర్యటించి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. వేసవి తీవ్రతరం అయినందున మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆయన అన్నారు. మండలంలో రహదారులు సరిగ్గా లేవని వాటిని మరమ్మతులు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, సర్పంచ్ కోటేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శి రాంబాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ప్రశాంత్, నాయకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: