CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ రచ్చబండ తో రాష్ట్రము లోని అందరికి న్యాయం చేస్తాము.--:జెడ్పిటిసి సున్నం నాగమణి వెల్లడి..

Share it:

 



 ములకలపల్లి:మే24:

మన్యం మనుగడ ప్రతినిధి :కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం డి అంజుమ్ అధ్యక్షతన, ములకలపల్లి సున్నం నాగమణి జెడ్పీటీసీ ములకలపల్లి ఆధ్వర్యంలో సీతారాంపురం పంచాయితీ చింతలపాడు గ్రామం,అన్నారం గ్రామం,గుర్రాల కుంట గ్రామాలలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.రైతు రచ్చబండ కార్యక్రమలో ములకలపల్లి జెడ్పిటిసి,టీపీసీసీ మెంబర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉండగా రైతుల బాధలను గుర్తించి ఏకకాలంలో వారి రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని,తెలిపారు.మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ₹ 2 లక్షల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని తెలియజేసారు.50 సంవత్సరాలు నుంచి సాగుచేసుకుంటున్న గిరిజన పోడు భూములకు హక్కు పత్రాలు కల్పిస్తామనితెలియపరిచారు.గతంలో పోడుభూముల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని గుర్తు చేస్తుసుకున్నారు. కౌలు రైతులకు సంవత్సరానికి 15 వేల రూపాయలు పంట సహాయం అందిస్తామని హామీ ఇస్తున్నాం మని,రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాట ధర కూడా కల్పిస్తామని,అర్హులందరికీ ₹ 5 లక్షల తో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి పద్మశ్రీ,తాటి రవి,గుర్రం జయసుధ,గుర్రం కృష్ణమూర్తి,కొరస వెంకటేష్,మడివి రాద తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: