మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:
బహుజన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్వహిస్తున్న పాదయాత్ర 60వ రోజు చండ్రుగొండ మండలానికి చేరుకుంటుందని ఈ కార్యక్రమానికి మండల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాల్సిందిగా బిఎస్పి పార్టీ మండల అధ్యక్షుడు ఇనుముల పిచ్చయ్య కోరారు. ఆదివారం చండ్రుగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా బిఎస్ పి పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నారని అందులో భాగంగా ఈనెల 9వ తేదీన చండ్రుగొండ మండలం లోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. అలాగే మండల కేంద్రములో పార్టీ దిమ్మను ఆయన ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు కంచర్ల మారతమ్మ, నాయకులు జంబుల లక్ష్మీనారాయణ, సిద్ధల నాగరాజు, సిద్దల శేషు, కంచర్ల రాములు, సిద్దల నీలయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: