- తలలు పట్టుకున్న మహిళలు...
మన్యం టీవీ చర్ల
ఈరోజు చర్ల మండలం లోని మూడు,నాల్గు గంటల సమయంలో వచ్చిన గాలి దుమారం ఆర్.కొత్తగూడెం గ్రామంలో బీభత్సం సృష్టించింది.చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామపం చాయతీ సమీపంలో ఉన్న బజారులోని నివాసముంటున్న కణితి నరసమ్మ ఇంటి పై కప్పు6 సిమెంటు రేకులు నూతనముగా నిర్మాణం చేసుకున్న రంగు స రస్వతి ఇంటి పై కప్పు 16 సిమెంట్ రేకు లు,కమలోజు సత్యవతి ఇంటి పైకప్పు రేకులు, కాకర్ల పెద్ద నరసింహచారి ఇంటి పైకప్పు రేకులు, దొడ్డి నాగరత్నం బాత్రూమ్ పైకప్పు రేకులు,గాలి దుమారానికి లేచి పో యి పగిలి ముక్క, ముక్క లయ్యాయి. దీం తో గృహిణి మహిళలు లబో దిబోమం టూ,తలలు పట్టు కున్నారు.కూలి పనులు చేసుకుని కూడ బెట్టు కున్న సొమ్ము కొంత,అప్పులు చేసి తెచ్చిన సొమ్ముతో కొనుక్కుని ఇంటి పై రేకులు వేసు కుంటే అగస్మా త్తుగా,గాలి దూమారం మాకోసమే వచ్చి మా ఇళ్లను ధ్వంసం చేసిందని బోరున విలపిస్తున్నారు.వ్యవసాయ పనులు ప్రారం భమైతే పనులు చేసుకుని చేసిన అప్పులు తీర్చకుందామనుకుంటె, ఇంతలోనే గాలి వచ్చి మమ్ములను పూర్తిగా నష్టపరిచాయని విలపిస్తున్నారు.మళ్లీ నీ రేకులు కొని వేసు కునే ఆర్థిక స్తోమత లేదని ఆవేదన చెందు తున్నారు.వేసవి కాలం పనులు లేక పూట గడవడమే కష్టంగా మారిందని ఆందోళన చెందుతున్నారు.సంబంధిత మండల అధికారులు,గాలి దుమారానికి ఇళ్ల పైకప్పులు రేకులు పగిలి పోయిన కుటుంబాలను పరిశీలించి
ఆదుకోవాలని కోరుతున్నారు.
Post A Comment: