CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫలించిన రేగా కృషి-ఆదివాసి గ్రామాలకు రహదారి సదుపాయం మునుపటి పాలనకు చరమగీతం- అభివృద్ధి పథంలో పినపాక నియోజకవర్గం

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


ఏళ్ల నాటి కల రేగా కృషితో నెరవేరనుంది. పినపాక మండలం లోని వలస ఆదివాసి గ్రామాలలో రహదారి సదుపాయం రానుంది. ఇప్పటివరకు పంచాయతీకి చేరుకోవాలంటే అటవీ మార్గం గుండా వాగులు, వంకలు దాటుతూ ప్రయాస పడే ఆదివాసీలు, మన్యం బాధలు తెలిసిన పాలకుడు, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మునుపటి పాలకులు చేయని పనిని పూర్తి చేయబోతున్నాడు. నియోజకవర్గ వ్యాప్తంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో, ఒక మంచి సత్ సంకల్పంతో రహదారి నిర్మాణాలు చేయబోతున్నాడు. పినపాక మండలం లోని వలస ఆదివాసీ గ్రామాలకు మంచిరోజులు రానున్నాయి. 296 లక్షల రూపాయల వ్యయంతో పినపాక మండలం కిష్టాపురం పంచాయతీ నుండి వలస ఆదివాసి గ్రామం పిట్ట తోగు వరకు, జానంపేట పంచాయితీ భూపతి రావు పేట నుండి వలస ఆదివాసీ గ్రామం సుందరయ్య నగర్ కు నూట 156 లక్షల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణం చేయబోతున్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ,ఇంత పెద్ద మొత్తం లో రహాదారులకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి, రోడ్డు రవాణా శాఖ ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎంపీ మాలోత్.కవిత కి,స్థానిక మంత్రి పువ్వాడ. అజయ్ కుమార్ కి, సహాకరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ ,జిల్లా ఎస్పి సునీల్ దత్ లకు నియోజక వర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: